నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లాలో రోజురోజుకూ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. చినుకు జాడ కనిపించకపోగా, కరువు తరుముకొస్తోంది. వానాకాలంలో కూడా ఎండాకాలాన్ని తలపించే విధంగా వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వానలు లేక బోరుబావులలో నీరు ఇంకిపోతున్నది. విద్యుత్ కోతల కారణంగా వేసిన కొద్దిపాటి వరితోపాటు, పత్తిచేలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో సాధారణ వర్షపాతం 752.6 మిల్లీమీటర్లు కాగా, గత ఖరీఫ్లో 1073.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఈసారి ఇప్పటివరకు కేవలం 42.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే కనుచూపు మేరల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. వరిచేలల్లో నెర్రెలు పారగా, పత్తి చేలు వాడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ అన్నదాతలు ఆకాశంవైపు చూస్తూ ఎండుతున్న పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. జిల్లాలో ఖరీఫ్సాగు విస్తీర్ణం 4,83,452 హెక్టార్లు కాగా, గత ఖరీఫ్లో రికార్డుస్థాయిలో 6,02,799 హెక్టార్లు సాగు అయ్యింది. అయితే ప్రస్తుత కరువు కారణంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 2,92,000 హెక్టార్లలో రైతులు వివిధపంటలను సాగుచేశారు. అంటే కేవలం 61 శాతం మాత్రమే సాగైంది.
వరి 46,639 హెక్టార్లు కాగా, పత్తి 2,22,000 హెక్టార్లలో సాగైంది. మిగతా వివిధ పంటలు సాగుచేశారు. నాన్ఆయకట్టు ప్రాంతాలలో సాగుచేసిన వరిపంటలో వర్షాభావ పరిస్థితులకు తోడు విద్యుత్ కోతల కారణంగా సగానికి సగం వరి చేలు నై వారి ఎండిపోతున్నాయి. పత్తి పంటలు కూడా సగానికి పైగా వాడిపోయి ఎర్రబారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాగైన పంటలు కూడా చేతికి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో అన్నదాతలలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరే పరిస్థితులు కానరాకపోవడంతో తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏది ఏమైనా వరుణుడు కరుణించి వర్షాలు కురిస్తే తప్ప పంటలు చేతికొచ్చే అవకాశమే లేదు.
వానమ్మా.. వానమ్మా..ఒక్కసారన్నా...వచ్చిపోవమ్మా...
Published Sun, Aug 24 2014 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement