ముందుకు కదలని పనులు
భూ సేకరణే ప్రధాన అవరోధం
టెండర్లలో జాప్యం
ప్రారంభంపై సందిగ్ధం
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రాచమార్గాల పనులు ఎప్పుడు మొదలవుతాయో... ఎప్పుడు పూర్తవుతాయో... అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా... రయ్య్న దూసుకుపోయేలా... అంతర్జాతీయ ప్రమాణాలతో రాచమార్గాలు (ఫ్లై ఓవర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్లు, స్కైవేలు) నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వనగరంలో భాగంగా రూ.20 వేల కోట్లకు పైగా వెచ్చించి... వీటిని నిర్మించాలనేది లక్ష్యం.
తొలిదశలో రూ.4,051 కోట్ల పనులను బీఓటీ-యాన్యుటీ పద్ధతిలో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. టెండర్ల విధి విధానాల ఖరారుకు గాను ఉన్నత స్థాయి కమిటీ నియామకానికి సమయం పట్టింది. తీరా కమిటీ ఏర్పాటయ్యాక టెండర్లు పిలుస్తారని అంచనా వేసినప్పటికీ... ఇప్పుడప్పుడే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ పిలిచినా.. పనులు చేపట్టేందుకు తొలిదశలో ఎంపిక చేసిన ఇరవై మార్గాల్లో 581 ప్రైవేట్ ఆస్తులను సేకరించాల్సి ఉంది.
ఎంతో డిమాండ్ ఉన్న ప్రధాన రహదారుల్లో గల ఈ ఆస్తులు సేకరించడం అంత సులువు కాదు. మెట్రో రైలు పనులకు భారీ నష్ట పరిహారాలు.. వెనువెంటనే చెల్లింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ 300కు పైగా ఆస్తులకుగాను ఇంకా 42 సేకరించాల్సి ఉంది. ఐదేళ్లుగా సేకరిస్తున్నా.. ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన రహదారి విస్తరణకు ఉప్పల్ మార్గంలో దాదాపు 180 ఆస్తులు సేకరించాల్సి ఉండగా.. ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అనుభవాల నేపథ్యంలో రాచమార్గాలకు ఆస్తులను సేకరించేందుకు ఎంత కాలం పడుతుందో చెప్పే పరిస్థితి లేదు.
తక్కువ సేకరించాల్సిన చోట...
తొలిదశలో 20 మార్గాల్లో రూ.4051 కోట్లతో పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. దీంతో ఏ మార్గంలో ఎంత మేర ఆస్తులు/భూ సేకరణ అవసరమో అధికాారులు సర్వే చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కలిపి సుమారు 80 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్తుల పరంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ... ప్రైవేట్ ఆస్తుల సేకరణ పెనుభారంగా మారనుంది. సంబంధితయజమానులను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
దీనికి నష్ట పరిహారం దాదాపు రూ.1500 కోట్లుగా అంచనా వేశారు. ఇవి పోనూ... మిగతా నిధులు దాదాపు రూ.2551 కోట్లతో రాచమార్గాలను నిర్మించనున్నారు. ఏమార్గంలో ఆస్తుల సేకరణ అతి తక్కువగా ఉంటుందో అక్కడ తొలుత పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అయితే... యాన్యుటీ విధానంలో పిలవనున్న ఈ టెండర్లకు ఎలాంటి స్పందన ఉంటుందో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు.
- మైండ్స్పేస్ జంక్షన్లో సేకరించాల్సిన ఆస్తుల కోసం ఇంకా లెక్కలు వేస్తున్నారు. దీనికి దాదాపు రూ.200 కోట్లు అవసరమని అంచనా. సైబర్ టవర్స్ జంక్షన్లో 9 ఎకరాల సేకరణకు కచ్చితంగా ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేస్తున్నారు.
- వీటితో పాటు వివిధ మార్గాల్లో సేకరించాల్సిన ప్రభుత్వ ఆస్తులు/భూములు 49.15ఎకరాలు ఉన్నాయి.
ఏదీ రాజ‘మార్గం?’
Published Wed, Jul 1 2015 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement