' ఇంటర్తోనే ప్రవేశపెట్టేందుకు ఎన్సీటీఈ కసరత్తు
' ఐదారు రకాల కోర్సులపై అధ్యయనం
' నేడు బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్తోనే ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏడాది కోర్సులుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులనే ప్రవేశపెట్టే అంశంపైనా దృష్టి సారించింది. అంతేకాదు పక్కాగా కళాశాలల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయిం చింది.
ఈ అంశాలన్నింటిపై శనివారం బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిందేనన్న జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్సీటీఈ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా, ప్రొఫెసన్ ఎన్కే జాన్గిరా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తమ నివేదికలను రెండు నెలల కిందట ఎన్సీటీఈకి అందజేశాయి. ఆ కమిటీలు ఉపాధ్యా య విద్య ప్రాధాన్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంతో క్రియాశీల ంగా వ్యవహరించే ఉపాధ్యాయ పాత్ర, వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉండాలన్న వివిధ అంశాలను చర్చించారు. పలు సూచనలు, సలహాల కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, అధికారులు కళాశాలల యాజమాన్యాలతో ఎన్సీటీఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కళాశాలలను కూడా పటిష్టం చేసే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతి కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లకు ఒక సెక్షన్ను ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. 1:15 రేషియోలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధించేందుకు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఉండగా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు అవసరమా? లేదా? అనే అంశాలపైనా చర్చించనుంది.
ఎన్సీటీఈ ప్రణాళిక .. వివరాలు
- రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ + గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (2+3+2)
- నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2)
- గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+2+2)
- గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+3)
- నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఏ/బీఎస్సీ బీఈడీ) + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2)
ఇక అన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులే!
Published Sat, Jul 26 2014 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement