చోరీ కేసులో పాత నేరస్తుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో పాత నేరస్తుడి అరెస్ట్

Published Thu, Jan 29 2015 3:15 PM

old robber arrested

నల్గొండ(మిర్యాలగూడ): గత కొన్ని సంవత్సరాలుగా పలు దొంగతనాలకు పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న పమ్మిడి ఆంజనేయుల్ని పోలీసులు అరెస్టు చేశారు.  గురువారం మిర్యాలగూడ శివార్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వక్తిని గుర్తించిన  తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది.

 

జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు చోరీలకు పాల్పడిన ఆంజనేయులు నుంచి  13 తులాల బంగారం, ఒక ద్విచక్రవాహనంతో పాటు ఎనిమిది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మిర్యాలగూడ డీఎస్‌పీ సందీప్ విలే కరులకు తెలిపారు.  తాను  బూర్గుల నర్సింహారావు, అరుణ్‌కుమార్, శ్రీనివాసరావు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు ఆంజనేయులు ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement