14 తులాల బంగారం,
90 తులాల వెండి ఆభరణాల అపహరణ
హసన్పర్తి : వృద్ధురాలు నమ్మి ఓ యువతికి తన ఇంట్లో ఆశ్రయమిస్తే.. అర్ధరాత్రి వేళ ఆ అగంతకురాలు సొత్తు దోచుకెళ్లింది. కొద్దిసేపు తలదాచుకుంటానని ఇంట్లోకి వచ్చి వృద్ధురాలికి సంబంధించిన సుమారు 14 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ.12,500 నగదు ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన ఉప్పుల యాకమ్మ, ముత్తయ్య దంపతులు హసన్పర్తిలోని కేశవాపూర్ రోడ్డులో నివాసముంటున్నారు. వారిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఓ యువతి ఇద్దరు పిల్లలతో వారింటికి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగింది. ఇల్లు ఖాళీ లేదని యూకమ్మ చెప్పడంతో ఆ యువతి వెళ్లిపోరుుంది. ఆ యువతి తిరిగి రాత్రి 8 గంటలకు మళ్లీ వారింటికి చేరుకుంది. అప్పడు మాత్రం ఆమెతో ఇద్దరు పిల్లలు లేరు. ఆమె తలుపు తట్టడంతో యాకమ్మ తలుపు తెరిచి ఎవరని ప్రశ్నించగా తనకు అద్దెకు ఇల్లు దొరికిందని, సామాను కూడా రూమ్కు తీసుకొచ్చానని చెప్పింది.
అయితే తన భర్త వచ్చేవరకు ఆలస్యమవుతుందని, ఇక్కడికి వచ్చానని నమ్మిం చింది. తన భర్త వస్తే వెళ్లిపోతానని, లేదంటే పొద్దున్నే వెళ్తానని చెప్పడంతో ఆ వృద్ధురాలు సరేనంది. రాత్రి 11 గంటల వరకు మాట్లాడిన యూకమ్మ తన సంచిని తీసి పక్కన పెట్టి నిద్రించింది. అదే సమయంలో ఆ యువతి కూడా నిద్రపోతున్న ట్లు నటించింది. అర్ధరాత్రి 12.30 గంటలకు యూకమ్మకు మెలకువ వచ్చి చూడగా అక్కడ ఆ యువతి కనిపించలేదు. పక్కనే బంగారం, వెండి, డబ్బులు దాచ్చుకున్న డబ్బా తాళం తెరిచి ఉంది. దీంతో ఆందోళనకు గురైన యాకమ్మ డబ్బాను పరిశీలించగా బంగారం, వెండి, డబ్బులు కనిపించలేదు. ఒక్కసారిగా షాక్కు గురైన వృద్ధురాలు లబోదిబోమంటూ బోరున ఏడుస్తుండగా చుట్టుపక్కల వారు విని అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిం చారు. బుధవారం ఉదయం ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై ఉపేందర్రావు సంఘటన స్థలాన్ని చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం హసన్పర్తికి చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన బంగారు గొలుసును ఈ యువతే తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అద్దె ఇల్లు కోసం సంచరించిన యువతి
సదరు యువతి మూడు ప్రాంతాల్లో అద్దె ఇల్లు కావాలని తిరిగి నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ప్రాంతంలోని పావుశెట్టి సాంబయ్య ఇంటికి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగినట్లు వారు తెలిపారు. అలాగే వీసం వాడకు వెళ్లి అద్దె ఇల్లు కోసం వెతికినట్లు ఆ కాలనీవాసులు వివరించారు. గాంధీనగర్లో కూడా ఆ యువతి సంచరించినట్లు చెప్పారు.
నమ్మి ఆశ్రయమిస్తే.. నడిరాత్రి దోచుకెళ్లింది
Published Thu, Dec 18 2014 8:02 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement