శివారు గ్రామాల ముక్కుపుటాలదిరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్రోడ్డును హరితహారంగా మలుస్తామని ప్రకటించిన కొన్నాళ్లకే.. ఈ రోడ్డు నిర్మాణానికి తవ్విన గోతులను ‘డంపింగ్ యార్డు’లుగా మార్చాలని నిర్ణయించింది. మట్టి, కంకర తవ్వకాలతో పెద్ద గోతులతో ఏర్పడిన గోతులను పూడ్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే ఔటర్కు ఇరువైపులా లీజు ముగిసిన క్వారీలను గ్రేటర్ చెత్తతో నింపేసేలా
ప్రణాళిక తయారు చేసింది.
- జవహర్నగర్పై భారాన్ని తగ్గించే ఆలోచన
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన యంత్రాంగం
- ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు
- హైదరాబాద్లో రోజుకు సగటున 3,800 టన్నుల చెత్త
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇటీవల రింగ్రోడ్డుపై చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల హరితహారం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే, తాజాగా ఔటర్ రహదారి నిర్మాణానికి తరలించిన మట్టితో ఏర్పడిన గుంతలను చెత్త డంపింగ్కు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో సగటున రోజుకు 3,800 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 90శాతం జవహర్నగర్లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ చెత్తను వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు.
అయినప్పటికీ, భూగర్భజలాలు కలుషితం కావడం, రోగాల బారిన పడుతుండడంతో ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జవహర్నగర్పై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ గోతులను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ సమతుల్యత, కాలుష్య సమస్యను అధిగమించేందుకు సరికొత్త టెకా్నాలజీని ఉపయోగిస్తామని, చెత్తను వేర్వేరుగా విభజించడం ద్వారా దుర్వాసనకు తావివ్వకుండా మట్టి పొరలతో నింపేస్తామని యంత్రాంగం చెబుతోంది. జవహ ర్నగర్లోనూ ఈ విధానం అమలు చేస్తున్నా కంపు కొడుతోందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్, గాజులరామారంలో లీజు పరిమితి ముగియడంతో 22 క్వారీలను రద్దు చేశారు. సర్వే నం.307, 308, 329/1, 79, 342లలో 148.26 ఎకరాల విస్తీర్ణంలోని 20 క్వారీల నుంచి మట్టి, కంకరను తీశారు. ఏడు మీటర్ల లోతుతో 34 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపిన ఈ ప్రాంతాన్ని డంపింగ్యార్డుకు ఉపయోగించుకున్నారు. నిజాంపేట్ సర్వే నం.332లో 14.97 ఎకరాల్లో ఉన్న రెండు క్వారీలు కూడా దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్నాయి. దాదాపు 6.67 క్యూబిక్ మీటర్ల మేర ఖనిజ వనరులను ఇక్కడ నుంచి తరలించారు.
- శంషాబాద్ మండలం కొత్వాల్గూడలోని 16 క్వారీల లెసైన్స్ను రద్దు చేశారు. స్థానికుల అభ్యంతరం మేరకు లీజును నిలిపివేశారు. దాదాపు 74.13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గుంతల నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి/ కంకరను తీశారు. మరో 20శాతం మేర తొలిగించారు. వీటిని కూడా డంపింగ్ యార్డు ప్రతిపాదనల్లో చేర్చారు.
- తుక్కుగూడ -పెద్దఅంబర్పేట్ జంక్షన్ వరకు ఔటర్ నిర్మాణ పనులు దక్కించుకున్న ‘గాయిత్రీ’ కాంట్రాక్టు సంస్థ ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలను జరిపింది. సర్వేనం. 300/1లో ఈ మట్టిని తొలగించిన సదరు సంస్థ.. దీన్ని ఔటర్ నిర్మాణంలో వినియోగించింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన క్వారీని గార్బెజ్ డంపింగ్ కోసం వాడుకోవాలని నిర్ణయించారు.
రింగ్ పక్కన చెత్త!
Published Thu, Aug 6 2015 11:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement