బలీయమైన శక్తిగా వైఎస్సార్‌సీపీ | Sakshi
Sakshi News home page

బలీయమైన శక్తిగా వైఎస్సార్‌సీపీ

Published Mon, May 19 2014 2:55 AM

బలీయమైన శక్తిగా వైఎస్సార్‌సీపీ - Sakshi

  • ‘గ్రేటర్’ ఎన్నికల నాటికి మరింత పటిష్టానికి వ్యూహం
  •  సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో తొలిసారి పోటీ చేసిన ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుమారు పద్నాలుగు నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ఓట్లను రాబట్టుకోగలిగింది. ఎక్కడా విజయం సాధించనప్పటికి ఆయా అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పట్టు సాధించింది.

    కుత్బుల్లాపూర్‌లో 26,973, శేరిలింగంపల్లిలో 24,347, ఖైరతాబాద్‌లో 23,845, కూకట్‌పల్లిలో 21,887, ఎల్బీనగర్‌లో 19,376, ఉప్పల్‌లో 16,394, మల్కాజిగిరిలో 14,828, సికింద్రాబాద్‌లో 11,688, జూబ్లీహిల్స్‌లో 10,528 ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు పోలైయ్యాయి.
     
    ‘గ్రేటర్’ ఎన్నికల కోసం కసరత్తు
     
    సాధారణ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే గ్రేటర్ ఎన్నికల నాటికి నిర్మాణ పరంగా మరింత పటిష్టమయ్యేందుకు కార్యాచరణ రూపొందించనుంది. ఈ విషయమై పార్టీ నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత చిత్తశుద్ధితో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ‘గ్రేటర్’ ఎన్నికల నాటికి పుంజుకుంటామన్నారు.
     

Advertisement
Advertisement