ప్రాణం తీసిన ‘ప్రైవేట్’ వైద్యం | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ‘ప్రైవేట్’ వైద్యం

Published Thu, Apr 30 2015 1:09 PM

One killed due to faill Private medical treatment

హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సిబ్బంది ఇచ్చిన ఇంజక్షన్ వికటించటంతోనే ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మీర్‌పేట ప్రాంతం ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీకి చెందిన శ్రీనివాస్(26) తీవ్ర ఛాతీనొప్పితో గురువారం ఉదయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

ఆ సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవటంతో కాంపౌండర్ ఆయనకు ఇంజక్షన్ చేశాడు. కొద్దిసేపటికే పరిస్థితి విషమించి శ్రీనివాస్ మృతి చెందారు. దీనిపై మృతుని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement