డీసీఎం, డీజిల్ ట్యాంకర్ ఢీ : ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

డీసీఎం, డీజిల్ ట్యాంకర్ ఢీ : ఒకరు మృతి

Published Tue, May 5 2015 10:12 AM

one person killed in road accident

నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండలంలోని కురమేడు గ్రామం వద్ద డీసీఎం వాహనాన్ని డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో డీసీఎం వాహనంలోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement