ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షకు ఒకే ఒక్కడు | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షకు ఒకే ఒక్కడు

Published Tue, Apr 25 2017 2:44 AM

ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షకు ఒకే ఒక్కడు - Sakshi

అతని కోసం ఓ కేంద్రం,ఆరుగురు సిబ్బంది విధులు

జడ్చర్ల టౌన్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరుగుతున్న ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సోమవారం ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు.  జడ్చర్లకు చెందిన సి.విష్ణుకుమార్‌ ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఎకనామిక్స్‌ పరీక్ష రాయాల్సి ఉంది. మరెవరూ ఆ సబ్జెక్టులో పరీక్ష రాయలేదు.

దీంతో విష్ణు కోసం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళా శాల కేంద్రంలో సీఎస్, సీసీ, ఇన్విజిలేటర్, డీఓలతోపాటు వాటర్‌బాయ్, ఓ కానిస్టే బుల్‌ విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఈ నెల 29న జరిగే పరీక్షకు కూడా ఇతను ఒక్కడే హాజరు కానున్నాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement