* నీరసించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం జరుపుతున్న ధాన్యం కొనుగోళ్లు నిర్దిష్ట లక్ష్యాలను చేరేలా కనిపించడం లేదు. కొనుగోళ్లు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ఆరంభమైన నేపథ్యంలో ఇంకా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కష్టమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో బియ్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించిన దృష్ట్యా మిల్లర్లు కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం తానే స్వయంగా కొనుగోళ్లు చేసేందుకు సంకల్పించింది.
14.87 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పౌర సరఫరాల శాఖ ఇందుకోసం 2,130 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు విస్తీర్ణమే 25శాతం తగ్గగా... విద్యుత్ కోతలు, నీటి నిల్వలు అడుగంటడంతో ధాన్యం ఉత్పత్తీ ఆశించినమేర రాలేదు. ఇదిలాఉండగా, బియ్యం లెవీని తగ్గించినా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడి బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు జరిపారు. ప్రభుత్వ రంగ సంస్థల మాదిరే మద్దతు ధర చెల్లించారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 9 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు జరపగా, మిల్లర్లు సైతం మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో ఆన్లైన్లో మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం చేసిన జాప్యం సైతం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేందుకు కారణంగా చెబుతున్నారు.
ఇక వరిసాగు ఆశించిన మేర జరగని ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నీరసించిపోయాయి. రెండు జిల్లాల్లో మొత్తం కొనుగోళ్లను కలుపుకున్నా 50 వేల మెట్రిక్ టన్నులకు మించలేదు.
ఖరీఫ్ ఆలస్యంగా మొదలైన చోట ప్రభుత్వం మరిన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అంచనా వేసినా అది లక్ష మెట్రిక్ టన్నులను మించి ఉండడం సాధ్యం కాదని పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొనుగోళ్లు పూర్తిగా ముగిసిన అనంతరం కారణాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.
కొనుగోళ్లలో లక్ష్యం చేరేనా?
Published Mon, Dec 22 2014 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement