► ప్రారంభంకానున్న నిర్మాణ పనులు
► బడ్జెట్లో అగ్రతాంబూలం
► ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
► మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రాక.?
► సాంకేతిక చర్యలపై అధికారుల కసరత్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ప్రతిష్టాత్మక పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మంచిరోజులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో ఈ ఎత్తిపోతల పథకానికే ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ మేరకు అధికారుల సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన పనులను 18 ప్యాకేజీలుగా టెండర్లను ఖరారు చేయడంతో ఇక పాలమూరు నిర్మాణం పరుగులు తీయనుందని ప్రజలు భావిస్తున్నారు.
పూర్తికాని భూ సేకరణ..
సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు సమాయత్తమవుతున్నా దీనికి సంబంధించి నాలుగు జలాశయాల పరిధిలో భూసేకరణ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పరిధిలో మొత్తం 16 లక్షల 446 వేల 40 ఎకరాల భూమిని ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించాలని సంకల్పించారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూ కొనుగోలును వేగవంతం చేస్తూ రిజిస్ట్రేషన్లను పూర్తిచేస్తున్నారు. మరోవైపు భూసేకరణ వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై వివిధ జలాశయాల పరిధిలోని ముంపుబాధితుల్లో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. కొందరైతే నష్టపరిహారాన్ని పెంచాలంటూ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అనుకున్న సమయానికి పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించే లక్ష్యంతో ఈ నెలాఖరుకు నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
గత జూన్లో శంకుస్థాపన
ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం జూన్ నెల 11వ తేదీన కర్వెన ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం వెనుక భాగం నుంచి నార్లాపూర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా రూపొందిన ఈ పథకం కింద ఉద్దండాపూర్ జలాశయం వరకు నీటిని తరలించేందుకు గాను టెండర్లను పూర్తిచేశారు. మార్చి నెల చివరి వారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్తోపాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావును ఆహ్వానించి పనులను ప్రారంభింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు మంత్రిని జిల్లాకు చెందిన అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఆహ్వానించినట్లు సమాచారం.
పనుల ప్రారంభానికి అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు 7 వేల 860 కోట్ల రూపాయలను కేటాయించడంతో పనులను వేగవంతంగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే జలాశయాల పరిధిలో సేకరించిన భూమి.. ఇంకా సేకరించాల్సింది ఎంత.. నిర్మాణ పనులకు తక్షణం ఎంత భూమి అవసరమవుతుందన్న అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూమిని అధికారికంగా సాగునీటి అధికారులకు అప్పగించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏయే ప్రాంతంలో ఎంత భూసేకరణ జరిగింది. అందులో రిజిస్ట్రేషన్ జరిగి నిర్మాణ పనులకు సిద్ధంగా ఉన్న భూమి ఎంతన్న అంశాన్ని రెవెన్యూ అధికారులు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
పాలమూరుకు ముహూర్తం నెలాఖరులో..
Published Thu, Mar 17 2016 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement