మిర్యాలగూడ : పంచాయతీలలో పన్నుల వసూళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. రెండు మాసాలుగా జిల్లాలోని 1176 గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి పన్ను బకాయిలతోపాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 20.09 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ రెండు మాసాల కాలంలో కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా రెండు, మూడు గ్రామాలకు ఒక్కే ఇన్చార్జ్గా వ్యవహరించడం వల్ల కూడా పన్నులు వసూలు కావడం లేవు. పన్నుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.
13వ ఫైనాన్స్ నిధులు రూ.88 కోట్లు మంజూరు
గ్రామాలలో ఆస్తి పన్నులు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీలకు గాను 13వ ఫైనాన్స్ నిధులు 88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోపాటు పన్నుల రూపంలో వసూలైన వాటిని కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించనుంది.
డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి గాను చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ భూమి ఉన్నచోట అదే భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలు, రోడ్లు చెత్త లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ నెల 31లోగా 80 శాతం పన్ను వసూళ్లకు ఆదేశాలు
ఈ నెల 31వ తేదీ లోగా గ్రామ పంచాయతీలలో 80 శాతం ఆస్తి పన్ను వసూళ్లకు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఒక్కొక్క మండలంలో కనీసం ఐదు గ్రామాల చొప్పున 300 గ్రామాల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందుకు గాను డివిజన్ స్థాయిలలో పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
నత్తనడకన పన్నుల వసూళ్లు
Published Wed, Mar 4 2015 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement