► వివాహేతర సంబంధమేకారణం
► ఇద్దరు నిందితుల అరెస్టు
► 8 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
కోస్గి(కరీంనగర్) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కలిసి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాం డ్కు తరలించారు. ఈ వివరాలను సోమవారం కోస్గి పోలీస్స్టేషన్లో కొడంగల్ సీఐ విశ్వప్రసాద్ వెల్లడించారు. బొంరాస్పేట మండలం దుద్యాలకు చెందిన సురేష్ (32)కు ముగ్గురు భార్యలు. కాగా మొదటి ఇద్దరితో తెగతెంపులు చేసుకుని రంగారెడ్డి జిల్లా యాలాల మండలం జక్కపల్లికి చెందిన బసంతను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు అదే మండలం సంగెం వాసి రవీందర్తో వివాహేతర సంబంధం ఉండేది.
భర్తకు ఈ విషయం తెలిసినప్పటికీ అతడితో స్నేహం కొనసాగించాడు. నెల రోజుల క్రితం బసంత కాన్పు కోసం స్వగ్రామానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తన బైక్ను ఫైనాన్స్ వారు తీసుకెళ్లారని, రూ.25 వేలు కావాలని రవీందర్కు ఫోన్ చేశా డు. డబ్బులు లేవని చెప్పడంతో వివాహేతర సంబంధం ప్రస్తావిస్తూ భార్యను వదిలిపెడతానని, కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి అదే గ్రామానికి చెందిన బాబాయి హన్మంతు తో కలిసి రవీందర్ పథకం పన్నాడు. ఇందులోభాగంగానే గత నెల 26 వ తేదీ రాత్రి 11 గంట లకు ఫోన్ చేసి రప్పించి బైక్పై ఎక్కించుకుని కోస్గికి వచ్చి మద్యం తాగి తోగాపూర్ సమీపంలోకి తీసుకెళ్లి గొడవకు దిగారు. మాటామాట పెరగడంతో కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేసి పారిపోయారు.
తీగలాగితే డొంక కదిలింది ఇలా...
మరుసటిరోజు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన సెల్ఫోన్, మద్యం బాటిల్, ధ్వంసమైన బైక్ ఆధారంగా ఎనిమిది రోజుల్లోనే మిస్టరీ ఛేదించారు. సురేష్ సెల్ ఫోన్లో నంబర్ల ఆధారంగా విచారణ జరిపి చివరకు ఇద్దరు నిందితులను సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు రాజునాయక్, శ్రీనివాస్, చంద్రశేఖర్లను సీఐ అభినందించారు.
అడ్డు తొలగించుకునేందుకే హత్య
Published Tue, Apr 5 2016 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement