సంగారెడ్డి రూరల్: మండల పరిధిలోని ఇంద్ర కరణ్ పొలిమేరల్లో సంచరిస్తున్న చిరుతతో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రక్షణ కరువైంది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాటు ఆ సమీపంలోనే చిరుత సంచరిస్తున్న అనవాళ్లు కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురౌతున్నారు.
గత వారం రోజులుగా గ్రామ పొలిమేరల్లోనే చిరుత సంచరిస్తూ ఏడెనిమిది గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు సార్లు గ్రామ రైతులకు కనిపించడంతో ప్రజలు మరింత భయానికి లోనౌతున్నారు. ఈ నేపథ్యంలో చిరుత ఆనవాళ్ల కోసం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో సైతం చిరుత దృశ్యాలు కనిపించాయి. దీంతో చెరకు తోట సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు రక్షణ కరువైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
పాఠశాలకు ఆవరణ పెద్దగా ఉన్నప్పటికీ ప్రహరీ లేకపోవడంతో చిన్నారులు మూత్ర విసర్జన కోసం, ఆడుకునేందుకు ఆవరణ అంతా తిరుగుతుంటారు. ఆవరణ చుట్టుతా చిట్టడవిలా ముళ్ల చెట్లు, పొదలు నిండి ఉన్నాయి. దీంతో పాటు చిరుత తరుచూ కనిపిస్తున్న చెరకు తోట పాఠశాలకు దగ్గరగా ఉండడంతో విద్యార్థులకు రక్షణ కరువై ప్రమాదం పొంచి ఉంది. ఏ ప్రమాదం జరగక ముందే చిరుతను త్వరగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
భయపెడుతున్న చిరుత సంచారం
Published Fri, Nov 28 2014 10:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
Advertisement