* సూపర్ స్పెషాలిటీ అర్హత పరీక్షకు ఆర్జీయూహెచ్ఎస్ తిరస్కరణ
* స్విమ్స్, నిమ్స్ ప్రవేశాలకు అనుమతిచ్చినా కౌన్సెలింగ్కు నో
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయి ఎంసెట్ రాసిన విద్యార్థులు బాధపడుతూంటే, మరోవైపు పీజీ వైద్య పూర్తి చేసినా సూపర్స్పెషాలిటీకి ప్రవేశ పరీక్షకు అనుమతించకపోవడంపై పీజీ వైద్యులు తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ పీజీలకే ఉండటం విస్మయపరిచే అంశం. 2010-13 బ్యాచ్లో పీజీ పూర్తిచేసుకున్న వైద్యులకు సూపర్ స్పెషాలిటీ అర్హత ప్రవేశ పరీక్షకు కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని స్విమ్స్, నిమ్స్లు నిరాకరించాయి. 2013లో పీజీ పూర్తిచేసిన వారిని గ్రామీణ సర్వీసులకు వెళ్లాలని, లేదంటే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రభుత్వం మొండికేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ వివాదంపై 2013 నవంబర్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు హైకోర్టుకెళ్లారు. ఈ కేసుపై ధర్మాసనం గ్రామీణ సర్వీసుకు, సర్టిఫికెట్లకు లింకు పెట్టడం సరికాదని, సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలని చెప్పింది. అయినా సరే ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో సుమారు 300 మందికిపైగా పీజీ వైద్యులు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక పోయారు.
ఎంసీఐ రిజిస్ట్రేషన్ లేని కారణంగా కర్ణాటకలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ (ఆర్జీయూహెచ్ఎస్) రాష్ట్ర పీజీలను సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశ పరీక్షకు అనుమతించలేదు. ఈనెల చివరి వారంలో నిమ్స్, స్విమ్స్ ఇన్స్టిట్యూట్లలో జరిగే సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించినప్పటికీ, కౌన్సెలింగ్ నాటికి ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని షరతు విధించారు. జూలైలో జరిగే జిప్మెర్ సూపర్ స్పెషాలిటీకి కూడా అనుమతించే అవకాశం లేదని పీజీ వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా మొండికేసింది. ఇప్పటికే జూనియర్ వైద్యుల తరఫున హైకోర్టులో ప్రభుత్వం కోర్టు ఉల్లంఘన పిటిషన్ వేసింది. పీజీ వైద్యులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పీజీ వైద్యులకు చుక్కెదురు
Published Sat, Jun 7 2014 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement