ఫొటోగ్రాఫర్లను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్లను ఆదుకోవాలి

Published Tue, Aug 11 2015 1:53 AM

Photographer contribute more

చిట్యాల : ఫొటోగ్రాఫర్లను ఆదుకునేందుకు ప్ర భుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టాలని ఫొ టోగ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రా ష్ట్ర గౌరవ అధ్యక్షుడు లింగమూర్తి కోరారు. సో మవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫొటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు చిం తల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోగ్రాఫర్లకు ఆదరణ లేకుండా పోతోందన్నారు. తెలంగాణ ఉ ద్యమంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర అత్యంత కీల మైందన్నారు.

దీని ని దృష్టిలో పెట్టుకుని నెల వేతనం రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మయూరి రవీందర్‌రెడ్డి, వాసుదేవరావు, రఫీ, సహాయ కార్యదర్శి రమేష్, ఆర్గనైజర్లు నాగేందర్, రాజేందర్, పూర్ణచందర్, రాంబాబు, వీరన్న, పరకాల మండల అధ్యక్షులు సుధాకర్, అశోక్, ప్రధాన కార్యదర్శి రఘోత్తంరెడ్డి, కోశాధికారి మాచర్ల సంజీవ్, బాధ్యులు మహేందర్, పుల్ల రవితేజ, దాసారపు సదానందం, దేవేందర్, నాగరాజు, బాబారాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement