మంత్రి పోచారంను ఆకర్షించిన ‘సాక్షి’ కథనం | Sakshi
Sakshi News home page

మంత్రి పోచారంను ఆకర్షించిన ‘సాక్షి’ కథనం

Published Fri, Jun 17 2016 2:21 AM

మంత్రి పోచారంను ఆకర్షించిన ‘సాక్షి’ కథనం - Sakshi

భిక్కనూరు:  రుతుపవనాలు, తటస్థ స్థితిలో వాతావరణం గురించి గురువారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన కథనం ‘ఎలినినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె’  వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఎంతగానో ఆకర్షించింది. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లిలోని నర్సరీని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి ‘సాక్షి’ దినపత్రికను తెప్పించుకుని ఈ వార్త కథనాన్ని క్షుణ్ణంగా చదివారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రుతుపవనాల రాక,  తటస్థ స్థితిలో ఉన్న వాతావరణం గురించి ‘ సాక్షి’ వార్త విపులంగా ఉందని ప్రశంసించారు. ఇలాంటి వార్తలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement