'రైతాంగాన్ని ఆదుకుంటాం' | Sakshi
Sakshi News home page

'రైతాంగాన్ని ఆదుకుంటాం'

Published Tue, Apr 14 2015 4:36 PM

pocharam srinivas reddy promises to support farmers

నిజామాబాద్: అకాల వర్షాలతో రైతులకు చాలా నష్టం జరిగిందన్న వాస్తవాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారు. చేతికొచ్చిన పంట నష్టపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.

 

మంగళవారం మీడియాతో మాట్లాడిన పోచారం.. రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని.. కచ్చితంగా రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై సర్వే జరుగుతుందని.. నివేదికలు రాగానే సాయం అందజేస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement