వరంగల్ క్రైం : పోలీస్ శాఖ.. అందులో వాహనాల విభాగమది.. పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగించే జీపులు, తదితర వాహనాల నిర్వహణ వ్యవహారాలను సరిచూసుకునే పని అతడిది. పని ఏదైతేనేం తనకు పైకం కావాలనుకున్నాడా అధికారి. అంతే... తన ఆలోచనకు పదునుపెట్టాడు. అందినకాడికి తన ఖాతాలో జమ చేసుకుంటున్నాడు. ప్రతిష్ఠకు ముడిపడి ఉన్న పోలీస్ శాఖలో అవినీతికి తెరతీసిన ఆ భక్షకభటుడి బాగోతం చర్చనీయాంశంగా మారింది.
డీజిల్ కోటాలో కోత..
వరంగల్ అర్బన్, రూరల్ పరిధిలోని వాహనాలకు కావాల్సిన ఇంధనంతోపాటు, వాటి మరమ్మతుల బాధ్యతలు సదరు అధికారే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో వాహనానికి సరిపడే డీజిల్ కోసం నెలవారీగా కూపన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సదరు అధికారి మాత్రం డీజిల్ కోతలో నెలవారీ కోటాలో వంద లీటర్ల వరకు కోత పెడుతున్నట్లు తెలిసింది. ఉదాహరణకు.. నగరం పరిధిలో నాలుగు రక్షక్, ఒకటి వజ్ర, ఏడు పెట్రోలింగ్ జీపులు ఉన్నాయి. వీటికి ఒక్కో వాహనానికి రోజువారీగా పది లీటర్ల చొప్పున నెలకు 300 లీటర్ల డీజిల్ కేటాయించాలి. అయితే, ఒక్కో వాహనంపై వంద లీటర్లకు కోత విధిస్తున్నాడు సదరు అధికారి.
ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.60గా ఉంది. అంటే ఒక్క వాహనంపైనే నెలవారీగా రూ.6వేల వరకు సదరు అధికారి జేబులోకి వెళ్తున్నాయన్నమాట. నగరం పరిధిలో ఏడు వాహనాలకు లెక్కేసుకుంటే 42వేల రూపాయలు..! నొక్కేస్తున్నాడు. అంతేకాదు, వాహనాలు మరమ్మతుకు చేరుకుంటే వాటిని సరిచేసేందుకు డబ్బులు చెల్లించే బా ధ్యత కూడా ఆ అధికారిదే. తమ వాహనం రిపేరుకొచ్చిం దని.. ఏ పోలీస్స్టేషన్కు చెందిన సిబ్బంది అయినా... వ స్తే చిన్నచిన్నవి మీరే చూసుకోవాలని ఉచిత సలహా అం దిస్తాడని ప్రచారంలో ఉంది. అలా మరమ్మతుల సొమ్ము ను కూడా వెనకేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది.
ఇలా నొక్కేసి.. అలా అమ్మేసి..
డీజిల్ కోటాలో కోత విధిస్తున్న అధికారి ఆ ఇంధనాన్ని భీమారం సమీపంలోని ఒక పెట్రోల్బంక్కు రెండు.. మూడు రోజులకోకసారి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత డీజిల్ను డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా ప్రభుత్వ డీజిల్ను ప్రైవేటు బంక్లకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
ఎందుకిదంతా...
ఇటీవల ఆ అధికారి గోపాలపురంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు తెలిసింది. సొంత డబ్బు ఎందుకు తీయాలనుకున్నాడో ఏమో.. ఇలా సర్కారు సొమ్మును వాడుకుంటున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు హోంగార్డులను ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. రక్షక్, పెట్రోలింగ్, సీఐ వాహనాలకు ఒక హోంగార్డు, ఏఆర్ కానిస్టేబుల్ డ్రైవర్లుగా ఉంటారు. ఇలా అర్బన్, రూరల్ పరిధిలో కలిపి 80మంది వరకు సిబ్బంది ఉంటారు. అయితే హోంగార్డుల విధులు ప్రతీనెల మారుతుంటాయి. అది ఈ అధికారి చేతుల్లోనే ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకున్న అతడు తన మాట వినేవారిని డబ్బు దండుకునేందుకు అనువైన చోట నియమించుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు ప్రతిఫలంగా హోంగార్డులతో తన ఇంటికి అవసరమైన సామగ్రిని ఉచితంగా తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
జీబులకు జేబులు!
Published Sat, Jul 12 2014 4:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement