పోలీస్‌ దాష్టీకం’పై విచారణకు హామీ | Sakshi
Sakshi News home page

పోలీస్‌ దాష్టీకం’పై విచారణకు హామీ

Published Mon, Sep 4 2017 4:41 AM

Police Guarantee to Investigation

వరంగల్‌ క్రైం: దొంగతనం చేశా డని ఓ బాలుడిని, అతడి తల్లిని మడికొండ పోలీసులు నెలకు పైగా విచారణ పేరిట చిత్రహింస లకు గురిచేసిన ఘటన పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మా రింది. ఈ ఘటనపై ‘బాలుడిపై పోలీస్‌ దాష్టీకం’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌ ఎడిషన్‌లో ఆదివారం  కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. బాధితులు శనివారం డీసీపీ వేణుగోపాల్‌రావుకు ఫిర్యా దు చేసిన తర్వాత 1098 చైల్డ్‌ లైన్‌కు ఫోన్‌ చేశారు. దీంతో వారు బాధితుల నుంచి వివరాలు సేక రించారు. సోమవారం బాలుడు, అతడి తల్లి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చినట్లు సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ కె.అనితారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement