మిషన్ కాకతీయకు పొంగులేటి ట్రస్ట్ విరాళం | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయకు పొంగులేటి ట్రస్ట్ విరాళం

Published Mon, Apr 27 2015 1:13 AM

Ponguleti trust Donation for Mission kakatiya

రూ. 10 లక్షలు ప్రకటించిన ఎంపీ
 ఖమ్మం అర్బన్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి ‘పొంగులేటి రాఘవరెడ్డి-స్వరాజ్యం ట్రస్ట్’ తరఫున రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ట్రస్ట్ అధినేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఆదివారం ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం చెరువు వరకు కొనసాగిన 2కే రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మిషన్ కాకతీయకు తన తల్లిదండ్రుల స్మారకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్ నుంచి విరాళం ఇస్తున్నట్లు చెప్పారు.

దీంతో సభలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఇలంబరితిలు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, నాయకులు దేవరపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దుంపల రవికుమార్, గోళ్లముడి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement