కరీంనగర్ లో పొంగులేటి పర్యటన | Sakshi
Sakshi News home page

కరీంనగర్ లో పొంగులేటి పర్యటన

Published Fri, Apr 17 2015 1:14 PM

కరీంనగర్ లో పొంగులేటి పర్యటన - Sakshi

కరీంనగర్: వడగండ్ల వాన, అకాల వర్షాలకు కరీంనగర్ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద పొంగులేటికి శుక్రవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలు డప్పులు కొడుతూ స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితర నేతలు ఆయన వెంట ఉన్నారు.

Advertisement
Advertisement