హైదరాబాద్: హైదరాబాద్పై పెత్తనం కోసం కేంద్రం ప్రయత్నించే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన చట్ట సవరణపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని పొన్నం ప్రభాకర్.... టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు.
విభజన చట్టం, కేంద్రంతో సంబంధాలు వంటి అంశాలలో టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలను సంప్రదించి విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రానికి ఈ సందర్భంగా పొన్నం విజ్ఞప్తి చేశారు. ఏపీ కౌన్సిల్ సభ్యుల సంఖ్య పెంపునకు విభజన చట్టసవరణ పరిమితం అవుతుందని అనుకోలేమని పొన్నం ప్రభాకర్ తెలిపారు.