♦ పిల్లలిద్దరికీ ట్రిపుల్ ఐటీలో సీటు
♦ గతేడాది ఒకరికి.. ఈ యేడాది మరొకరికి
♦ ఆనందంలో తల్లిదండ్రులు
కామారెడ్డి : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లల్ని జెడ్పీహెచ్ఎస్ గంజ్ ఉన్నత పాఠశాలలో చదివించారు. పిల్లలిద్దరూ కష్టపడి చదివారు. గత యేడాది వారి కూతురు ట్రిపుల్ ఐటీకి ఎంపికైతే, ఈ యేడాది కొడుకు ఎంపికై నేనేం తక్కువ కాదని నిరూపించాడు. ఇంకేముంది, ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోరుుంది.
పిట్లంకు చెందిన జంపగల్ల నగేశ్, అన్నపూర్ణ దంపతులు ఇరువై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్టణానికి వ చ్చారు. ఇద్దరూ చెరో పనిచేసుకుంటూ పిల్లలిద్దరిని పోషిస్తున్నారు. చేసిన పనికి వచ్చే కూలీ డబ్బులు తిండికే సరిపోతుండడంతో ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకుండా పోరుుంది. కానీ, వారి నమ్మకాన్ని పిల్లలు వమ్ము చేయలేదు. కష్టపడి చదివారు ఇద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ‘తమ కష్టాన్ని పిల్లలు గుర్తించి తగిన ఫలితం ఇచ్చారని’ చెమర్చిన కళ్లతో నగేశ్, అన్నపూర్ణ దంపతులిద్దరూ ‘సాక్షి’తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
పిల్లలే మా వెలుగు...
మా ఇద్దరికీ చదువు రాదు. పిల్లలను సర్కారు బడిలో చది వించాం. పిల్లలిద్దరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. ఇద్దరూ ట్రిపుల్ ఐటీకి ఎంపికవడం ఆనందం గా ఉంది. మా బావమర్ది చంద్రకాంత్ పిల్లలను ఎంతగానో ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకా రం అందించారు. పిల్లలే మాకు వెలుగు.
నగేశ్,అన్నపూర్ణ, తల్లితండ్రులు
నాకు తోడుగా తమ్ముడు
ట్రిపుల్ ఐటీకి ఎంపికైన నాకు ఇప్పుడు తమ్ముడు తోడయ్యాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరం మంచిగా చదువుకుని అమ్మానాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. వాళ్లు పడే కష్టం రోజూ చూసి కష్టపడి చదివాం.
నందిని, కూతురు
ఉపాధ్యాయులు ప్రోత్సాహించారు
పదో తరగతిలో 9.7 జీపీఏ రావడానికి మా సార్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మా, నాన్నతో పాటు మామయ్య ప్రోత్సహించారు. మంచి చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాం.
నితీష్, కుమారుడు
పేదింట పూసిన విద్యాకుసుమాలు
Published Fri, Jul 3 2015 3:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement