పావులు కదుపుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
సదాశివపేట, న్యూస్లైన్: మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దృష్టిసారించాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు తమకే వస్తాయని రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. టీఆర్ఎస్కు చైర్మన్ వైస్ చైర్మన్ స్ధానాలు దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఏది ఏమైనా చెర్మైన్, వైస్ చెర్మైన్ పదవులు తమవేనని ఆ రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జూన్ రెండు వరకు ఆగాల్సిందే!
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈనెల 12 ప్రకటించినా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక మాత్రం జరిగే అవకాశాలు లేవని చేప్పవచ్చు. వీరి ఎంపిక జూన్ రెండో తేదీ తరువాతనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఏ ముహుర్తాన నిర్వహించారోగాని అడుగడుగునా ఉత్కంఠ తప్పడం లేదు. ఎన్నికలైన తరువాత ఫలితాలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఫలితాలు ఎప్పుడెప్పుడాఅని అభ్యర్థులు కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. ఫలితాలు విడుదలైతే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల పదవుల ఎన్నిక ఎప్పుడో అనే సందేహం తలెత్తుతోంది.
ఈ పదవుల ఎన్నికపై ఎన్నికల కమిషన్ ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు. జూన్ 2న అపాయింటెడ్ డే ఉన్నందువల్ల ైచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అయోమయం నెలకొంది. సదాశివపేట మున్సిపల్లో 23 వార్డులు ఉన్నాయి. ఇందులో 12 వార్డుల్లో మెజార్టీ ఉన్న పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశాలు లేనందువల్ల ఎంఐఎం, బీజేపీ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రులు గెలిచే అవకశాలు ఉన్నందువ్లల వారి మద్దతు తప్పనిసరి. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వుచేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఏరాజకీయ పార్టీకూడా చెర్మైన్ అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయలేదు. రెండు పార్టీల్లోను చైర్మన్ పేరు ప్రకటించనందువల్ల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందామని చెర్మైన్ అభ్యర్థి ఏవరో ఫలితాలు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అశిస్తున్న ఆశావహులు పార్టీ ముఖ్యులతో కలిసి ముందుగా మెజార్టీ సభ్యులను తమ అదుపులో పెట్టుకునేందుకు ఇప్పటి నుంచి గెలిచే అవకాశాలు ఉన్న కౌన్సిలర్లకు ప్రలోభాలు పెడుతున్నారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయాలని వీరు బేరసారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరో పక్క 12న కౌంటింగ్ పుర్తయి ఫలితాలు వెలువడినా తరువాత గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను జూన్ రెండు తర్వాతనే చేపట్టేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ అప్పటి వరకు క్యాంపులు నిర్వహించే అలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఎప్పుడుంటుందో తెలియని పక్షంలో క్యాంపులు నిర్వహించడం చాల ఖర్చుతో కూడుకున్న పనే. అయినా క్యాంపులు నిర్వహించకపోతే రోజు టెన్షన్ పడాల్సి వస్తుందని మెజార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించడమే ఉత్తమమని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఎమ్మెల్యే, ఎంపీ ఓటు మున్సిపల్ చెర్మైన్ ఎన్నికల్లో కీలకం కావడంతో వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపడతారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సంగారెడ్డిలోగాని సదాశివపేట మున్సిపల్ పరిధిలో గాని తన ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. మెదక్ ఎంపీ విషయానికి వస్తే అయన మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఎక్కడో ఒకచోట ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
చైర్మన్, వైస్చైర్మన్ పదవులపైనే దృష్టి
Published Fri, May 9 2014 12:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణ ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement