గర్భిణి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

గర్భిణి అనుమానాస్పద మృతి

Published Mon, Feb 23 2015 5:44 PM

pregnant woman died Suspiciously

నల్లగొండ (మిర్యాలగూడ ): ఆళ్లగడప గ్రామపంచాయతీ పరిధిలోని సుబ్బారెడ్డి గూడెంలో ఒక నిండు గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త మరో పెళ్లి చేసుకోవడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు తీశారని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. ఎం శేఖర్, ఎం. సువానీ (23)లకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. ఇప్పుడు సువానీ ఏడో నెల గర్భవతి. మృతదేహం వద్ద విద్యుత్ వైర్లు పడి ఉన్నాయని, ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తెది సహజ మరణం కాదని తల్లి ఆరోపిస్తున్నారు. భార్య మృతి సమయంలో హైదరాబాద్‌లో ఉన్నానని, తాను వచ్చేసరికే సువానీ మరణించిందని భర్త చెబుతున్నాడు. సువానీని శేఖరే హతమార్చాడన్న ఆరోపణలు.. మృతురాలి బంధువుల ఆరోపణల నేపథ్యంలో శేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో ఆమె మరణించి ఉండటాన్ని తెలుసుకున్న తల్లి, బంధువులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తెను అల్లుడు శేఖరే హత మార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తల్లి చెప్పారు.

Advertisement
Advertisement