సాక్షి, కరీంనగర్ : సామాజిక, ఆర్థిక సర్వేకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తొలినుంచీ సర్వే విధులకు ‘నో’ అంటున్న ప్రైవేట్ ఎన్యూమరేటర్లు కొందరు సోమవారం చివరిక్షణంలో చేతులెత్తేశారు. ఒక్క వేములవాడలోనే శిక్షణ పొందిన 112 మంది ప్రైవేట్ ఎన్యూమరేటర్లు రిపోర్టు చేయలేదు. చేయనివారు జిల్లావ్యాప్తంగా 600 మందికిపైగా ఉన్నారు. శిక్షణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనారోగ్య కారణాలతో విధులు రద్దు చేయించుకున్నారు.
దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న అధికారులు హుటాహుటీన ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఫోన్లు చేసి సర్వే విధులు కేటాయించారు. రాత్రికి రాత్రే సీనియర్ విద్యార్థులు, నిరుద్యోగులను హాజరుకావాలని సూచించారు. అయితే తమకు ఎలాంటి శిక్షణ, అవగాహన లేకుండా సర్వే ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. సర్వే ముందురోజే రిపోర్టు చేసి న ఎన్యూమరేటర్లకు జిల్లాలో పలుచోట్ల ఇబ్బందులు తప్పలేదు.
ఎంపి క చేసిన సిబ్బంది సోమవారం ఆయా పట్టణాలు.. మండలాలు.. గ్రామాల్లో రిపోర్టు చేశారు. అధికారులు ఒక్కో ఎన్యూమరేటర్కు 24 ఇళ్ల నుంచి 30 ఇళ్ల వరకు కేటాయించారు. ముందస్తుగానే సర్వేఫారాలు అందించాల్సి ఉన్నా.. కొన్నిచోట్ల మంగళవారం ఉదయమే అందిస్తామని అధికారులు చెప్పారు. తీరా సమయానికి ఫారాలు తక్కువ పడితే పరిస్థితి ఏంటని ఎన్యుమరేటర్లు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే హుస్నాబాద్ మండలంలో 150 ఫారాలు, మెట్పల్లిలో 900, తిమ్మాపూర్ 200 ఫారాలు తక్కువగా వచ్చాయని మండల సమన్వయ కో-ఆర్డినేటర్లు సోమవారం వీడియో కాన్ఫరెన్సులో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రామడుగు మండలం వెదిరలో ఫారాలు అందించలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ సర్వేఫారాలు తక్కువ పడ్డాయి. సిరిసిల్ల పట్టణంలో స్టేషనరీ అందలేదు. ఉదయం ఐదు గంటలలోపు ఆయా ప్రాంతాలకు ఫారాలు పంపిణీ చేస్తామని హామీఇచ్చారు.
ఎన్యూమరేటర్లపై దాడి..
సిరిసిల్లలోని సుందరయ్యనగర్లో ఎన్యుమరేటర్లు ప్రవీణ్, సాయిలపైతాగుబోతులు దాడిచేశారు. ఎందుకొచ్చార్రా.. అంటూ చేయి చేసుకున్నారు. సర్వే చేస్తున్న సమయంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఎలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. సర్వే నిర్వహణలో టీఏ, డీఏ చెల్లించబోమని ప్రభుత్వం ముందే చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్పని పరిస్థితిలో విధులు నిర్వర్తించేందుకు ముందుకొచ్చి నా.. ప్రైవేట్ సిబ్బంది అయిష్టత చూపుతున్నారు. సర్వేను విజయవంతం చేసేందుకు జిల్లాయంత్రాంగం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తోంది. సిబ్బందీ చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
‘సర్వే’కు షాక్..
Published Tue, Aug 19 2014 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement