- దాహార్తితో అల్లాడుతున్న 154 కాలనీలు
- మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు
- నిధుల విడుదలలో గ్రేటర్ నిర్లక్ష్యం
- 30 శాతం చెల్లించేందుకు 870 కాలనీలు సిద్ధం
- స్పందించని యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ శివార్లలోని కాలనీలు, బస్తీల దాహార్తిని తీర్చడంలో జీహెచ్ఎంసీ దారుణంగా విఫలమవుతోంది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఎంపిక చేసిన 154 కాలనీల్లో మంచినీటి సరఫరాకు పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించేందుకు అవసరమైన రూ.30.62 కోట్ల (70 శాతం వాటా) నిధుల విడుదలలో ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటికే 13.70 కోట్లు (సుమారు 30 శాతం) నిధులను జలమండలికి చెల్లించిన స్థానికులు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు.
70:30 పథకానికి చెల్లుచీటీ
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జలమండలికి శివారు ప్రాంతాల్లో దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటి నెట్వర్క్ను విస్తరించడం ఆర్థికంగా భారంగా పరిణమించింది. దీంతో ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం స్థానిక కాలనీల ప్రజలు 30 శాతం నిధులు చెల్లిస్తే.. మిగిలిన 70 శాతం జీహెచ్ఎంసీ విడుదల చేయాలని ఏడాది క్రితం నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన జోనల్ కమిషనర్లు ఈ పథకం కింద శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 154 కాలనీలను ఎంపిక చేశారు. అక్కడి ప్రజలు ఈ పథకం ద్వారా మంచినీరుపొందేందుకు తమ వాటాగా 30 శాతం నిధులను జలమండలికి డిపాజిట్ చేశారు. కానీ ఏడాదిగా జీహెచ్ఎంసీ 70 శాతం నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
870 కాలనీలకు ఇదే దుస్థితి..
గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీల్లో తాగునీటి సరఫరా నెట్వర్క్ లేకపోవడంతో స్థానికులు ఫిల్టర్ ప్లాంట్లు, బోరుబావులు, ట్యాంకర్ నీళ్లపైనే ఆధారపడుతున్నారు. ఈ కాలనీ వాసుల నుంచి ఏటా ఠంఛనుగా ఆస్తిపన్ను వసూలు చేసుకొని ఖజనా నింపుకుంటున్న జలమండలి దాహార్తిని తీర్చడంలో విఫలమౌతోందని వారు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఏటా జలమండలికి ఆస్తిపన్ను వాటాగా రూ.125 కోట్లు విడుదల చేయడంలోనూ జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శివార్ల గొంతెండుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
శివార్లకు ‘జల’క్!
Published Mon, Jun 29 2015 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement