ప్రభుత్వ స్కూళ్లలో వసతులకు 235 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం, ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడం, ఆంగ్ల మాధ్యమంలో చదివించాలన్న తల్లిదండ్రుల ఆలోచన వల్ల ఏటా లక్షన్నర మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ కట్టి, మెయిం టెనెన్స్ కింద రూ. 60 కోట్ల చొప్పున, హైస్కూళ్లకు రూ. లక్ష, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 50 వేల చొప్పున నిధులిస్తున్నామన్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేశామని ఈ అంశంపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, సభ్యులు పూల రవీందర్, రామచంద్రారావు, పొంగులేటి సుధాకర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్, పాతూరి సుధాకర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు.
టీచర్ల పనితీరు బాగోలేదు: షబ్బీర్
పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, స్కూళ్లకు రాకుండానే సంతకాలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉప్పల్వాయిలో ఓ హెడ్మాస్టర్ 29 రోజులు పాఠశాలకు రాకున్నా వచ్చినట్లుగా సంతకాలు పెట్టారని.. ఇలా అనేక పాఠశాలల్లో జరుగుతోందన్నారు. ఉపాధ్యాయుల పనితీరు వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం.. దేశంలోనే చివరి స్థానంలో ఉందని, దాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
త్వరలో విత్తన చట్టం: పోచారం
నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు త్వరలోనే విత్తన చట్టాన్ని తీసుకురానున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ మిరప విత్తన విక్రయదారులపై ఇప్పటికే కఠినంగా వ్యవ హరిస్తున్నామని, పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాల కారణంగా 8,171 మంది రైతులు నష్టపోయారని, 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దీనికి కారణమైన 130 మంది విత్తన డీలర్ల లైసెన్స్లు రద్దు చేసి 17 క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 2,556 మంది రైతులకు రూ. 1.57 కోట్ల నష్ట పరిహారం చెల్లించామన్నారు.
హైదరాబాద్లో కొత్త నీటి పైప్లైన్లు: కేటీఆర్
కృష్ణా, గోదావరి నదుల నుంచి తాగునీటి సరఫరా పెంచేందుకు హైదరాబాద్లో కొత్త నీటి పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నీటిసరఫరా సేవలను విస్తరించేందుకు అల్వాల్, కాప్రా, ఉప్పల్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కూకట్æపల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు సర్కిళ్లలో ఫీడర్ మెయిన్తో పాటు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్లు, పంపిణీ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయన్నారు. 2018 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.
విడిగా నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటు
రాష్ట్రంలో నాన్వెజ్ మార్కెట్ను విడిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. రాష్ట్రంలో చేపలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా చేపల పెంపకం, వాటిని మార్కెట్ చేయడానికి తగిన ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.
మండలిలో ప్రశ్నోత్తరాలు
Published Fri, Dec 30 2016 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement