'రైల్వే కమిటీ సిఫార్సులు ఉపసంహరించుకోవాలి' | Sakshi
Sakshi News home page

'రైల్వే కమిటీ సిఫార్సులు ఉపసంహరించుకోవాలి'

Published Mon, Apr 6 2015 11:40 AM

' Railway recommendations of the Committee reiterated its '

కరీంనగర్: కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైల్వే కమిటీ సిఫార్సులను వెంటనే ఉపసంహరించుకోవాలని రైల్వే మజ్దూర్ యూనియన్ (ఆర్‌ఎంయూ) నాయకులు రామగుండం రైల్వే స్టేషన్ ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. రైల్వేలోని కొన్ని విభాగాలను ప్రైవేటు పరం చేయడం మంచిదని కమిటీ చైర్మన్ వివేక్ డేబ్రాయ్ రైల్వే శాఖకు సిఫార్సులు అందజేశారు. దీనివల్ల సామాన్య ప్రయాణికులపై భారం పడుతుందని, రైల్వే ఉద్యోగులకు నష్టమని చెప్పారు. రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ కె. యాదవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా  జరిగింది.
(రామగుండం)

 

Advertisement
Advertisement