హత్య కేసులో రాజేందర్‌రెడ్డికి ఊరట | Sakshi
Sakshi News home page

హత్య కేసులో రాజేందర్‌రెడ్డికి ఊరట

Published Fri, Sep 1 2017 1:24 AM

Rajendra Reddy's relief in murder case

ముందస్తు బెయిల్‌ మంజూరు  
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్య కేసులో నాల్గవ నిందితుడైన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ఉమ్మడి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. మురళి హత్య కేసులో  ముందస్తు బెయిల్‌ మం జూరు చేయాలంటూ రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని గురువారం జస్టిస్‌ సునీల్‌ చౌదరి విచారణ జరిపారు. ఈ  కేసులో రాజేందర్‌రెడ్డి పాత్రపై పోలీసులు అదనపు సమాచారా న్ని కోర్టు ముందు ఉంచకపోవడంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తులో పోలీసుల కు సహకరించాలని ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement