హైదరాబాద్: సద్భావన అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సోమవారం చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది రాజీవ్ సద్భావన అవార్డును గులాంనబీ ఆజాద్ కు ఆయన అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అమలు పై ప్రకటన చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని... రాహుల్ గాంధీ కోరారని ఆయన గుర్తు చేశారు. సద్భావనకు విఘాతం కలిగిన చోట కాంగ్రెస్ ప్రజల ఐక్యతకు కృషిచేస్తోందన్నారు. రాహుల్ గాంధీ పార్టీ కోసం ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు.