కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ :
జిల్లాలోని 817 ఎంపీటీసీలు, 57 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలో ఒకరోజు, కరీంనగర్, సిరిసిల్ల డివిజన్లలో మరో రోజు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 57 జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
దీనికోసం జెడ్పీలో ఐదు ప్రత్యేక కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఎంపీటీసీ నామినేషన్లు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో వేయా ల్సి ఉంటుంది. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బ్యాలెట్ పద్ధతిన పార్టీ ప్రాతిపాదికనే ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటు స్థానిక ఎన్నికల్లో ఉండదు.
ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్లు అధికారులు విడుదల చేశారు. జెడ్పీ ఎన్నికల్లో 27 లక్షల 40 వేల 666 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో 15 వేల సిబ్బంది పాలుపంచుకోనున్నారు. రీపోలింగ్, కౌంటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదివారం పరిశీలించారు. అభ్యర్థులు లోపలికి ఒక ద్వారం నుంచి వచ్చి మరో ద్వారం గుండా బయటకు వెళ్లేలా వే ర్వేరు ద్వారాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బారీకేడ్లు ఏర్పాట్లు చేయాలని అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించాలని చెప్పారు. మైక్, హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సహకరించాలి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ వివరించారు. పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు.
సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ సీఈవో వి.సదానందం, డీఆర్డీఏ పీడీ విజయ్గోపాల్, డెప్యూటీ సీఈవో సత్యవతి, డీపీవో కుమారస్వామి, డెప్యూటి సీఈవో సత్యవతి, డీఎస్పీ రవీందర్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఎం.స్వామినాథాచార్యులు, కొరివి వేణుగోపాల్, వాసాల రమేశ్, కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, భీమాసాహెబ్ పాల్గొన్నారు.
పరిషత్ పోరు షురూ!
Published Mon, Mar 17 2014 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement