‘పోటీ చేయను, టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తాం’ | Sakshi
Sakshi News home page

‘పోటీ చేయను, టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తాం’

Published Sat, Oct 1 2016 5:03 PM

‘పోటీ చేయను, టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తాం’ - Sakshi

హైదరాబాద్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉందని, ఈ అంశంపై సీఎంతో మాట్లాడటం సాధ్యపడలేదన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పే అలవాటు ఉందని అన్నారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా... మరోసారి అఖిలపక్ష భేటీ తర్వాత జిల్లాల తుది నివేదికలు వెల్లడిస్తామంటున్నారని, బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకుండా పోయిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కేసీఆర్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. ఆరోగ్య సేవలను పునరుద్దరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement