న్యాయశాఖ ఆమోదంతో మార్గం సుగమం
ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాటే ఏర్పాటైన 92 నూతన పోలీసు స్టేషన్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఎట్టకేలకు లభించనుంది. ఈ అంశంపై పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలకు న్యాయశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సబ్ ఇన్స్పెక్టర్లు కొత్తగా ఏర్పడిన పోలీస్స్టేషన్ల పేరిటే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం లభించనుంది.
ఇప్పటివరకు పాత ఠాణాల్లోనే...
గతేడాది దసరాకు కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటై నప్పటికీ వాటి పరిధిలో జరిగిన నేరాలకు సంబం ధించిన కేసులను ఇప్పటివరకు పాత పోలీసు స్టేషన్ల పేరిటే రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. దీని వల్ల కొత్త, పాత పోలీసు స్టేషన్ల మధ్య పరిధి వివాదంతోపాటు న్యాయపరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో హోంశాఖ ఎఫ్ఐ ఆర్ నమోదు ఉత్తర్వులను అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు పంపించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
పాత కేసులు బదిలీ అవుతాయా?
పాత పోలీసు స్టేషన్ల పేరుతో మూడున్నర నెలలుగా నమోదవుతున్న కేసులను కొత్త పోలీసు స్టేషన్ల పేరిట బదిలీ చేసుకోవాలా లేదా అవే పోలీసు స్టేషన్ల పరిధితో చార్జిషీట్లు దాఖలు చేయాలా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లోని కోర్టుల పరిధిలోకి కేసులను బదిలీ చేసుకుంటే సరిపోతుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
కొత్త ఠాణాలకు ఎఫ్ఐఆర్ అధికారం
Published Fri, Jan 20 2017 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
నేతన్నల ఆప్తబంధువు జగనన్న
బొండాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం
వైఎస్సార్ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం
సర్నాల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి
ఆ పాపం బాలశౌరిదే
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement