* ఉదయం జాతీయ పతాకావిష్కరణ చేయనున్న గవర్నర్
* విద్యార్థుల కవాతు, శకటాల ప్రదర్శన ఉండదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గణతంత్ర వేడుకలు చాలా సాదాసీదాగా జరగనున్నాయి. వేడుకలు ఆలస్యం కానున్న నేపథ్యంలో పలు కార్యక్రమాలను రద్దు చేశారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గవర్నర్ నరసింహన్ ఒక్కరే పతాకావిష్కరణ చేయాల్సి రావడంతో వేడుకల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట ఆంధ్రప్రదేశ్లో ఏడున్నర గంటలకే విజయవాడలో గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్.. అక్కడ కార్యక్రమం ముగించుకుని పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమానికి 10.30 గంటలకు హాజరుకానున్నారు. ఈలోగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఉదయం నుంచి పరేడ్గ్రౌండ్లో నిల్చుని ఉంటే.. అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్నందున వారి కవాతును కార్యక్రమాల జాబితానుంచి తొలగించాలని నిర్ణయించారు. అలాగే ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవాల్లో విధిగా వివిధ శాఖల శకటాలు ప్రదర్శించడం ఆనవాయితీ.
అయితే ఈసారి ఆ శకటాల ప్రదర్శనను కూడా తొలగించారు. డీజీపీ అనురాగ్శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి, హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ప్రధాన కార్యర్శి అజయ్మిశ్రా, ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, ప్రొటోకాల్ కార్యదర్శి అర్విందర్సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈసారి సాదాసీదాగా గణతంత్ర వేడుకలు
Published Fri, Jan 9 2015 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement