సాక్షి,సిటీబ్యూరో: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావాలని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ (ఏఐసీఎస్వో) నేషనల్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఉదిత్రాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆల్ ఇండి యా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్ -2014 నిర్వహించారు.
ప్రైవేట్ రంగం, పదోన్నతులు, కార్పొరేట్ విద్యా సంస్థలు, డీలర్ షిప్, కాంట్రాక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో రిజర్వేషన్లు అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలల్లో అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని ప్రైవేట్ రంగంలోనూ అమలు చేయాలన్నారు. ఇందుకు అందరం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నా రు.
యువజన సంఘాలను ఉద్యమంలో భాగస్వాములు చేయాలన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దళితులను ఏకం చేయాల్సి ఉందన్నారు. విశ్రాంత చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు మాట్లాడుతూ ప్రమోషన్లలో రిజర్వేషన్కు సంబంధించి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలన్నారు. గురుకుల విద్యాలయ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేయడం కాదని, గ్రామాల్లోకి వె ళ్లి పనిచేయాలన్నారు.
సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోలాగా జాతీయ స్థాయిలో సబ్ప్లాన్ను జాతీయ స్థాయిలో చట్టంగా తేవాలన్నారు. ఆల్ ఇండియా క్రిష్టియన్ కౌన్సిల్ చైర్మన్ మాట్లాడుతూ జోషఫ్ డిసౌజా మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్కంట్యాక్స్ కమిషనర్ డాక్టర్ యు. దేవి ప్రసాద్, అడిషనల్ కమిషనర్ ఎం దయా సాగర్, ప్రముఖ కవి గోరటి వెంకన్న, కుల వివక్షపోరాట సమితి నేత జి. రాములు, ఓయూ లా కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, ప్రజా కవి గద్దర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ మాట తప్పారు : ఎంపీ ఉదిత్రాజ్
తెలంగాణ రాష్ట్రానికి దళితున్ని తొలి సీఎం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖరరావు మాట ఇచ్చి తర్వాత తప్పారని ఎంపీ డాక్టర్ ఉదిత్రాజ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర కీలకమైందన్నారు. దళితులను కేసీఆర్ విస్మరిస్తే దళితులకు ద్రోహం చేసినట్లేనని చెప్పారు.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం రావాలి
Published Mon, Jul 7 2014 4:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement