రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

Published Fri, Nov 17 2017 8:39 AM

Road accident kill 5 in different insidents at Hyderbad

హైదరాబాద్‌: నగరం, నగర శివారులో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఇద్దరు సంఘటనా స్థలంలో మృతిచెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా వెళ్తూ డివైడర్‌ వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయారు. సంఘటనా స్థలంలోనే ఆర్మూర్‌కు చెందిన అనిల్‌కుమార్‌(22), మల్లారెడ్డి కాలేజీలో బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతున్న రతన్‌ అంగీలు దుర్మరణం చెందగా ఆర్మూర్‌ మండలానికి చెందిన అమన్‌రాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు చెప్పారు. అలాగే శామీర్‌పేట్‌ మండలంలోని తూముకుంట తెలంగాణ స్పోర్ట్సు స్కూల్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరకల శ్రీకాంత్‌(35), అతని స్నేహితుడు ఎ.కొండల్‌ మృతిచెందారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement