సికింద్రాబాద్-మంచిర్యాల రైల్లో దోపిడీ | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్-మంచిర్యాల రైల్లో దోపిడీ

Published Mon, Jun 16 2014 11:32 AM

సికింద్రాబాద్-మంచిర్యాల రైల్లో దోపిడీ - Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్-మంచిర్యాల ఇంటర్ సిటీ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. వరంగల్ జిల్లా హసన్పర్తి వద్ద సోమవారం ఉదయం దోపిడీకి పాల్పడ్డారు. రెండు బోగీల్లోకి ప్రవేశించి మహిళల నుంచి 30 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు రైల్వే పోలీసులను కలసి ఫిర్యాదు చేశారు.

రైళ్లలో ప్రయాణికులకు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైళ్లలో తరచూ దాడులు, దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనే ఇటీవల ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైల్లో నుంచి బయటకు తోసివేశారు.

Advertisement
Advertisement