♦ రూ.3 వేల విలువైన విద్యుత్ సామగ్రి కూడా ఉచితం
♦ పేదల కోసం ‘దీన్ దయాళ్ యోజన’ కింద కొత్త పథకం
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయానికి నోచుకోని పేదలకు సర్కారు శుభవార్త తెచ్చింది. పేదల గృహాలకు కేవలం రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు.. మీటరు, హౌజ్ వైరింగ్, రెండు ఎల్ఈడీ బల్బులు, సర్వీసు వైరును ఉచితంగా అందజేయనుంది. విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాలకు కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజేవై)’పథకం కింద డిస్కంలు ఈ కార్యక్రమాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నాయి.
పూర్తిస్థాయి విద్యుదీకరణలో భాగంగా
ప్రస్తుతం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం రూ.1,200 చెల్లించాలి. దీంతోపాటు మీటరు, సర్వీసు వైరు, ఇంట్లో అవసరమైన వైర్లు, విద్యుత్ పరికరాలు వంటి వాటిని స్వయంగా కొనుక్కోవాలి. ఇది పేదలకు భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమంలో భాగంగా ‘డీడీయూజేవై’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు కేవలం రూ.100 సెక్యూరిటీ డిపాజిట్, రూ.25 దరఖాస్తు రుసుము కలిపి మొత్తం రూ.125 చెల్లిస్తే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారు. రూ.3 వేలు విలువైన విద్యుత్ సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. ఇందులో విద్యుత్ మీటర్, సర్వీస్ వైరుతో పాటు ఇంట్లో ఒక బల్బు, ఫ్యాన్, సాకెట్ను ఉపయోగించుకునేందుకు వీలుగా బోర్డుతో సహా హౌస్ వైరింగ్, ఇంటిలోపల, బయట పెట్టుకునేందుకు రెండు ఎల్ఈడీ బల్బులు ఉంటాయి. మొత్తంగా ఏడాదిలోగా రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని పేదల ఇళ్లన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రూ.457 కోట్ల అంచనా వ్యయంతో డీడీయూజేవై కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా... అందులో 75 శాతం నిధులను కేంద్రం, మిగతా 25 శాతం నిధులను డిస్కంలు భరించనున్నాయి.
50 యూనిట్ల లోపు ఉచితం..
నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేద ఎస్సీ, ఎస్టీల గృహాలకు డిస్కంలు ఇప్పటికే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. రూ.125కే కొత్త విద్యుత్ కనెక్షన్ పొందే పేద ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు సైతం ఈ పథకం కింద లబ్ధిపొందనున్నాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం ఉండదన్నారు.
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో..
గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో పేదల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు లేవు. తాజా కార్యక్రమం కింద ఆ గృహాలన్నింటికి కనెక్షన్లు మంజూరు చేసేం దుకు డిస్కంలు చర్యలు ప్రారంభించాయి. ఒక్కో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం పరిధిలోని ఇలాంటి గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాయి. రాష్ట్రంలో 3.5 లక్షల గ్రామీణ గృహాలకు డీడీయూజేవై కార్యక్రమం కింద విద్యుత్ కనెక్షన్లు జారీ చేయనున్నారు. విద్యుత్ సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లను సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
125 రూపాయలకే..పేదలకు ‘పవర్’
Published Thu, Jul 6 2017 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement