గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య విభాగం ప్రతిపాదనలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరి స్థితులు నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యల నిమిత్తం రూ.179 కోట్లు అవసరమని ప్రకృతి వైపరీత్యాల విభాగం సర్కారుకు నివేదించింది. పల్లెల్లో పరిస్థితులపై గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యుఎస్), పట్టణ ప్రాంతాల్లో ఎద్దడి పరిస్థితులపై ప్రజారోగ్య విభాగం, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇచ్చిన అంచనాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తాజాగా నివేదికను సిద్ధం చేశారు. దాన్ని పరిశీలించి నిధులను విడుదల చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రకృతి వైపరీత్యాల విభాగం సిఫారసు చేసింది. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం అవసరమైన చోట్ల కొత్త బోర్లను వేయాలని, పనిచేయని స్థితిలో ఉన్న వాటిని మరమ్మతులు చేయించాలంది. గ్రామీణ ప్రాంతాల్లో బావులను కొత్తగా తవ్వించడం, పాతవాటిని లోతు చేయాలంది. ఆయా బావు లకు పవర్ పంపులను అమర్చాలంది. గ్రామాల్లోని చెరువులను కాల్వల ద్వారా వచ్చే నీటితో నింపాలంది.గత్యంతరం లేని స్థితిలోనే అద్దె పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యవసాయ బావుల నుంచి నీటి సరఫరా చేయాలంది. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని పేర్కొంది.
కరువు మండలాలపై కేంద్రం శీతకన్ను
రాష్ట్రంలోని 231 మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరినా ఆశించిన మేరకు సాయం అందలేదు. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.486.16 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, కేంద్రం రూ.88.5 కోట్లు ఇచ్చింది. రూ.310.61 కోట్లు కావాలని ప్రతిపాదనలిచ్చిన గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ.72.86 కోట్లు, రూ.86.25 కోట్లు అడిగిన ప్రజారోగ్యశాఖకు రూ.9.21 కోట్లు, రూ.83.30 కోట్లను కోరిన హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్కు రూ.6.43 కోట్లు ఇచ్చేందుకే కేంద్రం ఆమోదం తెలిపింది. కరువు మండలాల్లో ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు తక్షణం రూ.179.04 కోట్లు విడుదల చేయాలని ఆయా విభాగాలు కోరాయి.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేయగా, మిగిలిన మొత్తం విడుదలకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.
కరువు ప్రాంతాల్లో తాగునీటికి రూ.179 కోట్లు
Published Mon, Mar 7 2016 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
Advertisement