- రెండేళ్లలో ఖర్చు చేస్తామన్న కేంద్ర మంత్రి ప్రతాప్ రూడీ
- తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: యువతలో నైపుణ్యాన్ని పెంపొం దించేందుకు రానున్న రెండేళ్లలో రూ.32 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్రూడీ చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 25 వేల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి రాజధానిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవల ప్మెంట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏవీ కళాశాలలో జరిగిన సభలో మాట్లాడు తూ.. ‘తరగతి గది బోధనలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం లభించడం లేదు. చైనా, జపాన్ తదితర దేశాల్లో విద్యార్థులకు ఫ్యాక్టరీల్లోనే శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. దేశంలో ఏటా 18 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుంటే.. 9 లక్షల మందికి ఉద్యోగాలు లభించడం లేదు. తెలంగాణలో యువతకు నైపుణ్య శిక్షణను అందించేందుకు తెలంగాణ జాగృతి ముందుకు రావడం అభినందనీయం’ అన్నారు.
విద్యపై ఎంపీలు దృష్టి సారించాలి: గవర్నర్
రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని, ప్రతి ఎంపీ తమ నియోజకవర్గాల్లో విద్యపై దృష్టి సారించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. విద్యారంగంలో పెనుమార్పులు తీసుకురావాలని, స్కిల్ డెవలప్మెంట్ అనేది విద్యలో భాగంగా ఉండాలన్నారు. నైపుణ్యాభివృద్ధి లేకుపోతే మేక్ ఇన్ ఇండియాను తయారు చేయలేమన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... నిరుద్యోగ సమస్యను నిర్మూలించినపుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో నైపుణ్యం కలిగిన యువత తక్కువగా ఉండడమే నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమన్నారు.
మానవ వనరుల అభివృద్ధే కీలకం
అభివృద్ధి అంటే కేవలం రహదారులు, ప్రాజెక్ట్ల నిర్మాణం మాత్రమే కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తె లంగాణలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా కేంద్రాల్లో 18 విభాగాల్లో టెన్త్, అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి ఉపాధి శిక్షణను అందిస్తున్నామన్నారు. ఎంపీలు జితేందర్రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, లక్ష్మణ్, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో నైపుణ్య శిక్షణ పొందిన యువతీయువకులు, ట్రైనర్లకు ప్రశంసా పత్రాలు, అవార్డులను కేంద్ర మంత్రి, గవర్నర్ అందించారు. తెలంగాణ జాగృతి బ్రోచర్, వెబ్సైట్ ఆవిష్కరించారు.
నైపుణ్యాభివృద్ధికి రూ.32 వేల కోట్లు
Published Sat, Sep 3 2016 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement