గజ్వేల్ : సీఎం సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ మార్కెట్ యార్డుకు మహర్దశ పట్టనుంది. దీని అభివృద్ధి కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గోదాం, షెడ్లు, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు గురువారం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
అదేవిధంగా మార్కెట్యార్డులో రూ.5కే సద్దిమూట కార్యక్రమం అమలు కానుంది. గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, తూప్రాన్ మండలాల రైతుల ప్రయోజనాల కోసం గజ్వేల్లో 19 ఏళ్ల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైంది. తూప్రాన్ రోడ్డువైపున సకల హంగులతో యార్డును నిర్మించారు. జిల్లా రైతులే కాకుండా నియోజకవర్గానికి సమీపంలో ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల రైతులకు కూడా ఈ యార్డు ఆధారమే.
ప్రతిసారి ఆదాయపరంగా సిద్దిపేట తర్వాత స్థానాన్ని సాధిస్తూ జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. కానీ ఈ యార్డులో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ మూడు ఓపెన్ ప్లాట్ఫారాలు, మరో మూడు గోదాములు ఉన్నాయి. ఒక గోదామును పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్కు అద్దెకు ఇచ్చారు. మరో రెండింటిని సీజనల్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
రైతులు తీసుకువచ్చే ఉత్పత్తులను ఈ గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి లేదు. ఈ మూడు ఓపెన్ షెడ్లలో మాత్రమే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు నిల్వ చేసుకునే వీలుంది. కానీ ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఉత్పత్తులకు ఇది సరిపోవడం లేదు. రెండేళ్లుగా యార్డులో కొనుగోళ్ల సందర్భంగా నిత్యం వేలాది క్వింటాళ్ల ధాన్యం ఆరుబయటే ఉంచాల్సి రాగా, అకాల వర్షాలు కురిసి భారీ నష్టం చోటుచేసుకుంటోంది.
ఈ క్రమంలోనే యార్డు ఆదాయం నుంచి ఇటీవలే రూ.1.25 కోట్లతో 2500 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణం పనులను ప్రారంభించగా..అవి ప్రగతి పథంలో సాగుతున్నాయి. అదేవిధంగా మరో రూ.67 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయినా రైతుల ఇబ్బందులు తీరే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం యార్డు అభివృద్ధికి మరో రూ.4 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులలోని రూ. 1.30 కోట్లతో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము, రూ.1.20 కోట్లతో కవర్షెడ్ల నిర్మాణం, రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.60 లక్షల వ్యయంతో రైతుల విశ్రాంతి భవనం, సమావేశ మందిరం, రూ.10 లక్షల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణం జరుగనున్నది.
‘సద్దిమూట’కు శ్రీకారం...
యార్డుకు ఉత్పత్తులను అమ్ముకోవడానికి వచ్చే రైతులకు రూ.5లకే ‘సద్దిమూట’ పథకం కింద హరేరామ ఫౌండేషన్ సంస్థలు భోజనాన్ని అందించనున్నాయి. అభివృద్ధి పనులతోపాటు ‘సద్దిమూట’ పథకాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించనున్నారు.
గజ్వేల్ మార్కెట్యార్డుకు మహర్దశ
Published Thu, Nov 6 2014 1:08 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement