రూ. 4 లక్షల విలువైన మద్యం బాటిళ్లు చోరీ | Sakshi
Sakshi News home page

రూ. 4 లక్షల విలువైన మద్యం బాటిళ్లు చోరీ

Published Thu, Feb 4 2016 1:47 PM

Rs . 4 Lakhs worth of bottled liquor theft

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న విలువైన మద్యం సీసాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి రూ. 4 లక్షల విలువైన మద్యం బాటి ళ్లు చోరీకి గురైనట్లు గుర్తించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement