సాక్షి, హైదరాబాద్: అది నాంపల్లి సరాయి..! సమయం ఇంకా మధ్యాహ్నం 12 గంటలు కాలేదు. పరిసరాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలు ఇద్దరు ముగ్గురు అక్కడున్నారు. ఇంకా.. ఆటో డ్రైవర్లు.. చిరు వ్యాపారులు.. దినవేతన కార్మికులు.. కాలేజీ కుర్రాళ్లు.. ఇతరత్రా వర్గాల వారు క్రమేపీ పెరుగుతున్నారు. 12 గంటలయ్యాక వాహనంలో అక్కడకు చేరుకున్న వేడివేడి భోజనాన్ని ఆరగించేందుకు ఎంతో ముందుగానే వారంతా అక్కడకు చేరుకున్నారు. క్యూలో నుంచొని టోకెన్ తీసుకొని.. టేబుల్ వద్దకెళ్లి విస్తరాకుల్లో వడ్డించిన భోజనాన్ని ఆత్రంగా అందుకున్న వారి కళ్లలో చెప్పలేని సంతృప్తి.
ఆకలిగొన్న వారు అమృతసమానంగా దాన్ని ఆరగిస్తున్న తీరు అనిర్వచనీయం. కారణం ఎదురుగానే ఉన్న హోటల్లో కప్పు చాయ్ రూ. 10. ఇక్కడ అందులో సగం ధర రూ. ఐదులకే కడుపునిండా భోజనం. ఆకలిగొన్న వారికి అంతకన్నా కావాల్సిందేముంటుంది? ప్రతినిత్యం వివిధ సమస్యలతో జీహెచ్ఎంసీని తిట్టుకునే వారు సైతం అది ప్రారంభించిన ఈ రూ.ఐదు లకే భోజన పథకాన్ని చూసి ఔరా అనాల్సిందే. ఎందరెందరో అభాగ్యులు.. అనాథలే కాక అన్నార్తులైన అందరికీ ఐదు రూపాయలకే నాణ్యమైన వేడి భోజనాన్ని అందించడం అంత ఈజీ కాదు. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్తో కలిసి జీహెచ్ఎంసీ దాదాపు మూడు మాసాల క్రితం ప్రారంభించిన ఈ పథకం ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. నాణ్యతలో రాజీ లేదు. నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ప్రస్తుతం ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.
త్వరలోనే మరో 42 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. స్థానికులకే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం ఎంతో ఉపయోగపడుతోందీ పథకం. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాగునీటి సదుపాయం లేదు. చాలాచోట్ల పైకప్పు లేక వర్షాకాలంలో ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఈ చిన్న సమస్యల్ని కూడా తీరిస్తే.. జీహెచ్ఎంసీ చరిత్రలోనే కాదు.. హైదరాబాద్ చరిత్రలోనే ఇదో అద్భుత కార్యక్రమంగా మారనుంది. ఆయా ప్రాంతాల్లో పథకం తీరును విజిట్ చేసిన ‘న్యూస్లైన్’కు కనిపించిన దృశ్యాలిలా ఉన్నాయి.
బడ్జెట్ తీరిదీ..
గ్రేటర్లో ఈ పథకం అమలుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 18 కోట్లు కేటాయించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 300 మందికి ఈ సదుపాయం వర్తింపచేయాలన్నది యోచన కాగా కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 200-250 మంది వినియోగించుకుంటున్నారు. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఈ పథకంలో భోజన ఖర్చు రూ. 22.50 అవుతుండగా, రూ. 5 లు మాత్రమే ప్రజల నుంచి తీసుకుంటున్నారు. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ రూ. 2.50 లు తనవంతు విరాళంగా అందజేస్తోంది. మిగతా రూ 15లు జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు మరింత ఖర్చుకైనా వెనుకాడేది లేదని భావిస్తోంది.
ఏ కార్పొరేషన్లో లేదు..
తమిళనాడులో అమ్మ పథకం పేరిట సబ్సిడీ ధరలకు క్యాంటీన్లున్నాయి. కానీ దేశంలోని మరే ఇతర నగరంలోనూ ఇలాంటి పథకం లేదు. ఏ మునిసిపల్ కార్పొరేషన్ కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టలేదు.
వేల కళ్లల్లో ఆనందం
Published Sun, May 25 2014 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement