ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి బస్సు బోల్తా కొట్టింది. ప్రయాణికుల అదృష్టం కొద్ది తృటిలో వారు ప్రాణాపాయస్థితినుంచి బయటపడ్డారు. ఆరుమందికి తీవ్ర గాయాలయ్యాయి. సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం తోలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు డ్రైవర్ను చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేశారు. - పెబ్బేరు
కొందరు ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారనడానికి ఇదొ క ఉదాహరణ. వనపర్తికి చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 3331) బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సం ప్రటావ్పల్లికి వెళ్లేందుకు ఆయా గ్రామాలకు చెందిన సుమారు 40 మంది ప్రయాణికులతో వనపర్తి నుంచి బయలు దే రింది. పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ గ్రామం దాటాక పుల్గర్చర్ల వరకు రా గానే ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ప్రయాణికులు ఒకరిమీద మరొకరు సీట్లకింద పడిపోయారు. వెనుక, ముందున్న అద్దాలతోపాటు కిటికీ అద్దాలు పగలడంతో స్వల్ప గాయాలైన ప్రయాణికులు లోపలినుంచి బయటికి వచ్చారు. సంఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చా రు. అనంతరం బస్సులో ఇరుక్కుపోయి న ప్రయాణికులను బయటికి తీసి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో వనపర్తి చెందిన చిన్న హనుమన్న, వీపనగండ్లకు చెందిన ఈశ్వరయ్య ఆచారి, దేవమ్మ, రామలక్ష్మ మ్మ, కల్వరాలకు చెందిన కుర్మయ్య, గుం టూరు జిల్లాకు చెందిన కంబ్లీబాయిలు ఉన్నారు. వారిలో ఈశ్వరయ్య ఆచారిని, రామలక్ష్మమ్మలను మెరుగైన వైద్యం కో సం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మిగిలిన వారికి వనపర్తిలోనే చికిత్సలు చేయిస్తున్నారు.
డ్రైవర్ను చితకబాదిన ప్రయాణికులు
ఇదిలావుండగా డ్రైవర్ బాలకృష్ణ సెల్ఫో న్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పడంతో కొందరు ప్రయాణికులు అతన్ని వెంబడించి చితకబాదా డు. కాసేపటి తర్వాత డ్రైవర్ వారినుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇదిలావుంటే బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని పెబ్బేరు ఎస్ఐ జితేందర్రెడ్డి పరిశీలించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు.
బాధితుల పరామర్శ
వనపర్తి రూరల్ : బస్సు ప్రమాదంలో గా యపడిన ఆరుగురిని వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆర్డీఓ రాంచందర్ పరామర్శించారు. సంఘటన జరిగిన తీ రును తెలుసుకున్నారు. గాయపడిన వా రినిప్రభుత్వం తరుపున ఆదుకుంటామ ని భరోసా ఇచ్చారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. బాధితు లు కోలుకునేవరకు మెరుగైన వైద్యం అం దించాలని వైద్యులు భాస్కర్ను ఆదేశించారు. అనంతరం అక్కడినుంచి డిపో మేనేజర్ కృష్ణయ్యతో సంఘటన గురించి మాట్లాడారు.
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం
Published Thu, Oct 30 2014 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement