సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతీ విషయంలో ప్రభుత్వమే ఆదుకోవాలంటే ఎట్లా. సంస్థ అంతర్గత సామర్థ్యం పెంచి ఆదాయాన్ని పెంచుకోండి. ఈరోజు నుంచే కార్యోన్ముఖులు కండి’’ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి 44 శాతం ఫిట్మెంట్ ప్రకకటన వేళ సీఎం చంద్రశేఖరరావు ఆర్టీసీ అధికారులకు సూచించిన మాట. అంతర్గత సామర్థ్యం పెంపునకు కార్యోన్ముఖులయ్యే మాట అటుంచితే ఆర్టీసీ ఖజానాకే వారు కన్నం పెట్టేస్తున్నారు. రాయితీ ప్రయాణాల(బస్పాస్)ల వల్ల సంస్థ తీవ్రంగా నష్టపోతోందని, ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సిన ప్రభుత్వం సరిగా స్పందించటం లేదని ఆరోపించే అధికారులు... అదే ‘రాయితీ’ని దుర్వినియోగం చేస్తున్నారు.
ఇదీ సంగతి...
ఆర్టీసీలో పనిచేసే ఉన్నతాధికారుల మొదలు సాధారణ సిబ్బంది వరకు ‘ప్రివిలేజ్ పాస్’ వెసులుబాటు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసినప్పుడు దీన్ని వినియోగించుకోవాలి. ఏడాదిలో మూడు పర్యాయాలు వాడుకోవచ్చు. సాధారణ సిబ్బందికి ఆ మూడు పర్యాయాలు ఆర్టీసీ బస్సుల్లో కుటుంబీకులతో కలిసి ఉచితంగా ప్రయాణించొచ్చు. అధికారులకు మాత్రం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలనే నిబంధన నుంచి సడలింపు ఉంది.
ప్రైవేటు వాహనాలు, రైలు, విమానంలో ప్రయాణించినప్పటికీ దీన్ని వినియోగించుకోవచ్చు. ఒక్కో పర్యాయానికి రూ.12 వేల వరకు గరిష్టంగా ప్రయాణ ఖర్చును రీయింబర్స్ చేసుకోవచ్చు. ఏటా మూడు పర్యాయాలు కలిపి రూ.36 వేలు పొందొచ్చు. అయితే ఉద్యోగి భార్య/భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి ఇది వర్తించదు. వారు పనిచేస్తున్న ప్రభుత్వ విభాగం నుంచి ఈ తరహా వెసులుబాటు పొందడం లేదని డిక్లరేషన్ సమర్పిస్తే ప్రివిలేజ్ పాస్ పొందొచ్చు. అధికులు అధికారుల భార్య/భర్తలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ డిక్లరేషన్లు సమర్పించడం లేదు.
వీరు అటు తాము పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ఇటు ఆర్టీసీ... రెండు వైపుల నుంచి ప్రయాణ ఖర్చును రీయింబర్స్ చేసుకుంటున్నారు. ఇలా ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారో గుర్తించే వ్యవస్థ లేకపోవటంతో యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతోంది. ఏ అధికారి భార్య/భర్త ప్రభుత్వ ఉద్యోగో కూడా తెలియని దాఖలాలున్నాయి. అధికారులు గోప్యంగా ఉంచినా... గుర్తించే విధానం లేదు. కొంతమంది నిజాయితీగా వివరాలు పొందుపరుస్తున్నప్పటికీ అధికులు సమర్పించకుండా ప్రివిలేజ్ పాస్ నిధులు కొల్లగొడుతున్నారు.
అటు వారి భార్య/భర్త పనిచేసే ప్రభుత్వ కార్యాలయంలోనూ ఈ విషయాన్ని దాచి ఉంచి అక్కడి నుంచి అక్కడి వెసులుబాటును పొందుతున్నారు. ఇలా నిబంధనకు తూట్లు పొడుస్తూ ఇటు ఆర్టీసీ, అటు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఇలాంటివారు వందల్లో ఉన్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అంతర్గత ఆడి ట్ జరుగుతున్నా... దీన్ని పట్టించుకోవటం లేదు. నాలుగేళ్లకోమారు కలిపి దీన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఏడాదికి రూ.36 వేలు చొప్పున నాలుగేళ్లమొత్తం కలిపి రూ.1.44 లక్షలు ఒకేసారి పొందుతున్నారు. దీంతో హాయిగా విదేశీ ప్రయాణాలు జరుపుతున్నారు.
ఆర్టీసీ అధికారుల ‘ప్రివిలేజి’ దోపిడీ
Published Thu, Jul 9 2015 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement