శ్రీరంగం వెంకన్న సాహసం గొప్పది.. | Sakshi
Sakshi News home page

శ్రీరంగం వెంకన్న సాహసం గొప్పది..

Published Tue, Apr 7 2015 1:39 AM

Sakshi reporter's brave act

రూ.5 వేల పారితోషికం అందజేత
డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెరెడ్డి

 
వరంగల్ : సమాజానికి ఉపయోగపడేలా ఉగ్రవాదుల ఫొటోలను చిత్రీకరించిన నల్లగొండ జిల్లా అర్వపల్లి మండల ‘సాక్షి’ విలేకరి శ్రీరంగం వెంకన్న సాహసం ఎంతో గొప్పదని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కొనియాడారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వారు ప్రమాదకరమైన ఉగ్రవాదులైనప్పటికీ... ప్రాణాలకు తెగించి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన వెంకన్నకు ప్రోత్సాహకంగా రూ.5 వేలు నజరానా అందిస్తున్నట్లు తెలిపారు.

సోమవారం డీసీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో సాక్షి సిబ్బందికి చెక్కు రూపంలో ఈ మొత్తాన్ని రాజేందర్‌రెడ్డి అందించారు. శ్రీరంగం వెంకన్న జిల్లాకు వస్తే ఘనంగా సన్మానిస్తామని ప్రకటించారు. సమావేశంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, పీసీసీ మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, నమిండ్ల శ్రీనివాస్, సారంగపాణి, లక్ష్మన్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement