హైదరాబాద్: ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డు విజేతల ఎంపిక బుధవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, నృత్యం, సంగీతం, పారిశ్రామికం తదితర రంగాల్లో ఉత్తమ ప్రతిభావంతులైన వారిని ‘సాక్షి ఎక్సలెన్స్- 2014’ అవార్డుకు అర్హులుగా జ్యూరీ ఎంపిక చేసింది. వివిధ దశల్లో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియ బుధవారం ఫైనల్కు చేరుకుంది. అవార్డుకు ఎంపికైన విజేతల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 16న జరుగనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఎన్జీవో,ఎక్సలెన్స్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఉత్తమ రైతు, సామాజిక సేవ, నృత్యం, సంగీతం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాట వాలు కలిగిన యువ విజేత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త, తెలుగు ఎన్ఆర్ఐ రంగాలలో ఎక్సలెన్స్ అవార్డులను అందజేసేం దుకు ‘సాక్షి’ వివిధ రంగాలకు చెందిన వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ‘సాక్షి’కి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు బుధవారం ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్రెడ్డి, సీనియర్ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్, ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, సన్షైన్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురువారెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త సుచిత్ర ఎల్లా, ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్లు, బ్యాడ్మింట్ క్రీడా కారుడు పుల్లెల గోపీచంద్, జ్యూరీ సభ్యులు గా వ్యవహరించారు. ఎంపిక ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా కొనసాగింది. తమకు అందిన ప్రతీ దరఖాస్తును న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యు లు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీ సభ్యులుగా వ్యవహరిం చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్షియల్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు.
‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డు విజేతల ఎంపిక పూర్తి
Published Thu, May 7 2015 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement